Editorial

Sunday, September 22, 2024
శాసనంవొప్పిచెఱ్ల, క్రిష్ణంగారిపల్లె శాసనాలు

వొప్పిచెఱ్ల, క్రిష్ణంగారిపల్లె శాసనాలు

Shasanamనేడు ఆగస్ట్ 27 వ తేదీ

క్రీ.శ 1299 ఆగస్ట్ 27 నాటి వొప్పిచెఱ్ల (గుంటూరు జిల్లా)శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో గుండయనాయకులు గురిందల స్తలము పింగలి స్తలములకు పాలకుడుగా నుండగా వొప్పిచెఱ్ల గ్రామ ప్రజలకు గోవులకు నీరందించుటకు గాడినూతులను కాలువలు తవ్వించి నీరెత్తించుటకయ్యే జీతాలకు రాజనంపాడి పోతినేనింగారు మరికొందరు అన్నయభక్తుడినుండి కొంతభూమి కొని యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా X నెం 488].

అట్లే క్రీ.శ 1547 ఆగస్ట్ 27 నాటి క్రిష్ణంగారిపల్లె (కడప జిల్లా)శిథిల శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర రామయదేవమహారాజులు ఏదోదానంచేసినట్లుగా చెప్పబడ్డది. శాసన శిల శిధిలమైనందున యితర దాన వివరాలు తెలియరావడంలేదు. [కడప జిల్లా శాసనాలు II నెం 189].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article