Editorial

Sunday, April 20, 2025
Audio Columnశ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ పద్యం

శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ పద్యం

విద్యార్థుల జీవితాన్ని పరిపూర్ణం చేసే గురుదేవులెవరో పేరుపేరునా చెప్పి కృతజ్ఞతలు తెలుపుకోమని సూచించే అపురూప పద్యం నేటి తెలుపు ప్రత్యేకం. రచన శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్. గానం శ్రీ కోట పురుషోత్తం.

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article